లాక్డౌన్ అమలుకు కేరళ పోలీసులు వినూత్న పద్ధతిని వినియోగిస్తున్నారు. ఊరూరికి, వీధివీధికి పోలీసు సిబ్బంది తిరగడం సాధ్యమయ్యే పని కాదు కనుక వారు డ్రోన్ల సాయంతో నిఘా చేపడుతున్నారు. చాలాచోట్ల లాక్ డౌన్ కచ్చితంగానే అమలవుతున్నప్పటికీ కొన్నిచోట్ల ప్రజలు గుమిగూడడం కనిపించింది. అయితే డ్రోన్ అక్కడికి వెళ్లగానే వారంతా చీమల్లా చెల్లాచెదురు కావడం కనిపించింది. ఇలాంటి వీడియోలన్నిటిని కూర్చి వీటికి సునీల్ గావస్కర్, రవిశాస్త్రి, సంజయ్ మంజ్రేకర్, ఇయాన్ బోథమ్ తదితరుల ట్రేసర్ బుల్లెట్ కామెంటరీ జోడించి ట్విట్టర్లో పెట్టారు.
లాక్డౌన్పై డ్రోన్ల నిఘా - కేరళ పోలీసుల ప్రయోగం